కేరళ నన్‌పై అత్యాచార ఘటనలో మరో ట్విస్ట్..

286
- Advertisement -

కేరళలో నన్‌పై జరిగిన అత్యాచార ఘటన మరో మలుపు తిరిగింది. నన్‌పై బిషప్ ఫ్రాంకో ములక్కన్ అత్యాచారం చేశారన్న ఘటనలో కీలక సాక్షి చనిపోయాడు. ఫాదర్ కురియాకోస్ కత్తుథర పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న ఓ చర్చిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ కేసులో బిషప్ ఫ్రాంకోకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన అనంతరం ఈ ఘటన జరగడం సంచలనం రేపుతోంది.

ఈ కేసు నుంచి తప్పుకోకపోతే చంపేస్తామని ఫాదర్ కురియకోస్‌ను కొంత మంది వ్యక్తులు బెదిరించారు. అయితే.. ఆ బెదిరింపులను పట్టించుకోకపోవడంతో కిరాతకంగా హత్య చేశారని బిషప్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దుండగులకు శిక్ష పడాలని.. ఈ కేసులో తాము న్యాయ పోరాటానికి దిగుతామని వారు స్పష్టం చేశారు. ఈ కేసులో మొత్తం వంద మందిని పోలీసులు ప్రశ్నించారు.

- Advertisement -