ధోనీ భార్యపై అభిమానుల ఆగ్రహం..

265
Dhoni Wife Sakshi
- Advertisement -

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె షేర్ చేసిన ఫొటో.. పోస్ట్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సభ్యుడు మోను కుమార్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

సాక్షి సింగ్‌ పెట్టిన పోస్ట్‌.. ‘బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది.. గడ్డి ఈ సైడ్‌ పచ్చగా లేదనుకుంటా.. ‘అంటూ మోను కుమార్‌ తలపై సాక్షి ముద్దు పెట్టింది. మోను కుమార్‌ బట్టతలపై సెటైర్‌ వేస్తూ బీపాజిటివ్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో సరదాగా సాక్షి చేసిన పోస్ట్‌పై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇలా పోస్ట్‌ పెట్టడం మమ్మల్ని బాధించింది, మిమ్మల్ని అన్‌ఫాలో అవుతున్నామంటూ మెసేజ్‌లు పెట్టారు.

https://www.instagram.com/p/BwnKZwFnyO-/?utm_source=ig_embed

- Advertisement -