ఆసక్తిరేపుతున్న ‘ఎవరు’ ట్రైలర్..

521
evaru
- Advertisement -

టాలీవుడ్ హీరో అడవి శేష్, నవీన్ చంద్ర, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవరు’ సినిమా ట్రైలర్ హీరో నాని చేతుల మీదుగా ఈ రోజు విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అడవి శేష్ అవినీతిపరుడైన పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. రెజీనాను రేప్ చేయబోయిన నవీన్ చంద్రను ఆమె కాల్చిచంపడంతో సినిమా ట్రైలర్ ప్రారంభవుతుంది.

ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథ, కథనాలతో సినిమా తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. అయితే నిజంగానే అత్యాచారయత్నం జరిగిందా? లేక దీనివెనుక మరో కుట్ర ఉందా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును పోలీస్ అధికారి విక్రమ్ వసుదేవ్(అడవి శేష్) కు అప్పగిస్తారు. ఈ కేసును విక్రమ్ ఎలా సాల్వ్ చేశాడన్న సస్పెన్స్ తో సినిమా కొనసాగుతుంది. వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఎవరు’ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -