నేచురోపతి మన భారతీయ వైద్యం- మంత్రి ఈటెల

482
Minister Etela Rajender
- Advertisement -

ఆదివారం నారాయణగూడ లోని కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో మెగా నేచురోపతి క్యాంప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేచురోపతి మన భారతీయ వైద్యం. నేచురోపతి వైద్యం అంటే నాకెంతో ఇష్టం. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వైద్య రంగంలో కొత్త టెక్నాలజీ ఎంత పెరిగినా… కొత్తగా వచ్చే రోగాల్ని మాత్రం ముందే గుర్తించలేక పోతున్నాం. 65% రోగాలు ఒత్తిడి వల్లే వస్తున్నాయని మంత్రి అన్నారు.

అయితే చాలా మంది తమ ఆరోగ్యంపై అశ్రద్ధ చూపిస్తున్నారు.ఏ పనికైనా షార్ట్ కర్ట్స్ వెతుక్కుంటున్నారు. ఇది మంచిది కాదు. నేచురోపతికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోస్తాం. ఒకప్పుడు పెద్దావాళ్ళు మాత్రమే నేచురోపతి వైద్యం తీసుకునేవాళ్ళు. ఇప్పడు యువకులు కూడా నేచురోపతి వైద్యం తీసుకుంటున్నారు. అని ఈటెల పేర్కొన్నారు.

- Advertisement -