గెలిచేది టీఆర్ఎసే: ఈటల, పల్లా

411
palla rajeshwarreddy
- Advertisement -

మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థులేనని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. హుజుర్‌నగర్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల….హుజురాబాద్,జమ్మికుంట పట్టణాలను అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ అన్నరు. కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులు గెలవలేరని …ఒకరో ఇద్దరో గెలిస్తే వారి అభివృద్ధి చేయలేరన్నారు.

ఐదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పల్లా … టీఆర్ఎస్ పూర్తి చేసిన పనుల్ని కాంగ్రెస్ చేస్తానంటోందని చురకలించారు.

అన్నపూర్ణ క్యాంటీన్ లో రూ.5 భోజనం అమలవుతుంది. …చెరువుల సుందరీకరణ చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇవన్నీ ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నవే కదా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఘోర ఓటమి తప్పదన్నారు.

- Advertisement -