ఉపాధి కూలీలతో మంత్రి ఎర్రబెల్లి భేటీ..

432
errabelli
- Advertisement -

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం దౌల‌త్ న‌గ‌ర్ శివారు‌ టూక్యా తండాలో ఉపాధి హామీ ప‌నుల‌ను ప‌రిశీలించారు పంచాయ‌తీరాజ్, గ్రామాణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

అక్క‌డి కూలీల‌తో మాట్లాడి… ఉపాధి హామీ ప‌నులు ఎలా జ‌రుగుతున్నాయ‌ని, ఏయే ప‌నులు చేస్తున్నార‌ని ఆరా తీశారు. క‌రోనా నేపథ్యంలో కూలీల‌కు మాస్కులు లేక‌పోవ‌డంతో వారికి వెంట‌నే త‌మ వ‌ద్ద నున్న మాస్కుల‌ను పంపిణీ చేశారు.

ఉపాధి హామీలో కూలీలంద‌రికీ ప‌ని క‌ల్పించాల‌ని సీఎం కేసీఆర్ చెప్పారని…కొత్త‌గా కూలీల‌కు జాబ్ కార్డులు కూడా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం అధికారుల‌కు చెప్పిందన్నారు. ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన వ‌ల‌స కూలీల ద్వారా క‌రోనా గ్రామాల‌కు కూడా పాకుతుందన్నారు.

ప్ర‌జ‌లు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాలని…క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా స్వీయ నియంత్ర‌ణ‌, ప‌రిశుభ్ర‌త‌ని పాటించాలన్నారు. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ, ఉపాధి ప‌నులు చేయాలన్నారు.

ఈ విధంగా ప‌నులు జ‌రిగేట్లుగా అధికారులు చూడాలని…అంద‌రికీ ఉపాధి క‌ల్పించాల‌న్న‌దే సిఎం కెసిఆర్, ప్ర‌భుత్వ ల‌క్ష్యం అన్నారు.ఉపాధి రేట్ల‌ను కూడా ప్ర‌భుత్వం పెంచింది. క‌నీసం రూ.200 దిన‌స‌రి ఉపాధి ల‌భించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు.

- Advertisement -