పనిచేసేవారికే ఓటు వేయాలిఃమంత్రి మల్లారెడ్డి

452
mallareddychengicharla
- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసేవారికే ఓటు వేయాలని కోరారు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోడుప్పల్ పరిధిలోని చెంగిచెర్లలో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, అభివృద్ధికి సహకరించే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అభివృద్ది చేసుకున్నట్లు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల తర్వాత కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా నిలిచి అన్ని వార్డుల్లో అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంఛార్జీలు బండి రమేష్‌, ఆనంద్‌, ఎంబీసీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -