‘అలాంటి మహిళలు ప్రవేశించరు’

228
- Advertisement -

కేరళలోని శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల ప్రవేశాన్ని నిషేధించడం సమర్థనీయమా? కాదా? అన్న అంశాన్ని తేల్చే బాధ్యతను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు గోపాలకృష్ణన్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Don’t want to turn Sabarimala temple into Thailand

ఒకవేళ మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు తొలగించినప్పటికీ.. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరని వ్యాఖ్యానించారు.

ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు నివేదించినప్పటికీ.. తమ వైఖరికే తాము కట్టుబడి ఉంటామని గోపాలకృష్ణన్‌ తెలిపారు. రుతుక్రమంలో ఉన్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించరాదన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు.

Don’t want to turn Sabarimala temple into Thailand

‘శబరిమల క్షేత్రాన్ని థాయ్‌లాండ్‌గా మార్చేందుకు మేం ఒప్పుకోం. మహిళలు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఒకవేళ కోర్టు మహిళల ప్రవేశానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. స్వగౌరవం ఉండే మహిళలు ఈ ఆలయంలోకి రారు.’ అని గోపాలకృష్ణన్‌ స్పందించారు.

- Advertisement -