ఢిల్లీలో ట్రంప్ దంపతులు…నేటి షెడ్యూలు ఇదే

378
Trump india
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాలో రెండు రోజుల పర్యటన నిమిత్తిం ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ట్రంప్ కుటుంబ సభ్యులు తాజ్ మహల్ సందర్శన అనంతరం వారు ఆగ్రా నుంచి ఢిల్లీ బయలుదేరారు. రాత్రి ఢిల్లీలోని హోటల్ ఐటిసి మౌర్యలో ట్రంప్ కుటుంబం బస చేశారు. ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏర్పాటు చేసే స్వాగత కార్యక్రమంలో ట్రంప్ పాల్గొంటారు.

అనంతరం రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. ఆపై హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఈ సమావేశం అనంతరం ఇరుదేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేసి, సంయుక్త ప్రకటన చేస్తారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో కోవింద్‌తో సమావేశమై, రాత్రి 10గంటలకు అమెరికా తిరుగు ప్రయాణమవుతారు.

- Advertisement -