దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌..

555
disha case
- Advertisement -

దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పోలీస్ కస్టడీలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు  అక్కడికక్కడే మృతి చెందారు. దిశను కాల్చిచంపిన ప్రాంతంలోనే నిందితులు ఎన్ కౌంటర్ అయ్యారు.

తొలుత నిందితులను తొండపల్లి టోల్ సమీపంలోని ఘటనా స్థలికి తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన ప్రదేశాన్ని పరిశీలించారు. దిశను ముందు చూసిందెవరు? అత్యాచారం చేయాలనే ఆలోచన ఎవరిది? తదితర వివరాలను సేకరించారు. నిందితులు పాతపెట్టిన దిశ మొబైల్‌ను వారితోనే తీయించారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు నిందితులపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందారు.

disha case accused encountered…disha case accused encountered…disha case accused encountered

- Advertisement -