ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాః తరుణ్ భాస్కర్

369
Tharun_Bhascker
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సెట్ చేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈమూవీ తర్వాత తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది అనే సినిమాను తెరకెక్కించారు. ఈసినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈమూవికి మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ ను ఖరారు చేశారు. హీరో విజయ్ దేవరకొండ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది.

యాంకర్ అనసూయ ఈమూవీకి కీలక పాత్రలో నటిస్తుంది. వచ్చే ఏడాది ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తరుణ్ భాస్కర్ తన తర్వాతి మూవీని ఎన్టీఆర్ తో చేయనున్నట్లు ఓ ఇంటర్వూలో చెప్పాడు. ఇటివలే ఎన్టీఆర్ ను కలిసి కథ చెప్పినట్లు తెలిపాడు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ అయిపోగానే ఎన్టీఆర్ తో నా మూవీ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

- Advertisement -