రాజకీయాల్లోకి వచ్చేలోపే రజనీ చచ్చిపోతాడు..!

435
rajinikanth
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు సుందర రాజన్‌. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రజనీతో పాటు పలువురిపై వివాదాస్పద కామెంట్స్ చేశారు.

రజినీకాంత్ పార్టీ పెట్టి, కోయింబత్తూరులో తొలి సమావేశం ఏర్పాటుచేసారనుకోండి.. ఆయన తిరుపూరు చేరుకునేలోపే చచ్చిపోతాడు. ఆయన శరీరం అంత క్రిటికల్‌గా ఉందని తెలిపారు. రజనీ ఎప్పటికి ఎంజీఆర్ కాలేడన్నారు. ఎంజీఆర్ కూర్చున్న సీటులో వీళ్లంతా కూర్చోవాలన్న ఆలోచన కూడా ఎలా వచ్చిందో నాకైతే అర్థంకావడంలేదని మండిపడ్డారు.

ఇక అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు టీచర్లు చాలా సంతోషించారు. ఎందుకంటే సీఎం అవడానికి ముందు అన్నాదురై కూడా టీచర్ ప్రొఫెషన్‌లోనే ఉన్నారు. కానీ టీచర్లు ఎవ్వరూ ఆయన్ను ఫాలో అయ్యి సీఎం అవ్వాలని అనుకోలేదన్నారు.

ఎంజీఆర్ తన సినిమాలోని విలన్లను ఎప్పుడూ చంపలేదు. కానీ రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి నటులు తమ సినిమాల్లోని విలన్స్‌ని ఎప్పుడూ చంపాలనే చూశారు. రాజు పాత్ర కూడా కేవలం ఎంజీఆర్‌కే సరిపోయింది. రజినీ, అజిత్, విజయ్ రాజు గెటప్ వేస్తే అసహ్యంగా ఉండేవారని వివాదాస్పద కామెంట్స్ చేశారు. సుందర రాజన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -