ఆ సింగ‌ర్ కు రూ.1ల‌క్ష ఇచ్చిన సుకుమార్..

245
sukumar
- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్ధ‌లం సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో మ‌న‌కు తెలిసిందే. ఆయ‌న కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇటివ‌లే ఈసినిమా 100రోజులు ఆడ‌టంతో ఫంక్ష‌న్ ను కూడా ఏర్పాటు చేశారు. సుకుమార్ ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈమూవీని నిర్మించారు. ఇక ఈచిత్రంలో పాట‌లు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాట‌ల ర‌చ‌యిత చంద్ర‌బోస్ ఈసినిమాలోని అన్ని పాట‌లు రాశారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

rangastlam jigelu rani

ఈమూవీలో ఐటెం సాంగ్ చాలా పాపుల‌ర్ అయ్యింది. జిగేలు రాణి అంటూ కుర్ర‌కారు మ‌న‌సును దోచుకున్నారు. అయితే ఈసాంగ్ పాడిన వెంక‌ట‌ల‌క్ష్మీ అనే సింగ‌ర్ కు అస‌లు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని గ‌త కొద్ది రోజుల క్రీతం మీడియాతో చెప్పిన విష‌యం తెలిసిందే. ఇటివ‌లే విష‌యం తెలుసుకున్న డైరెక్ట‌ర్ సుకుమార్ ఆమెను క‌లిశారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం బీఆర్టీ కాలనీలో నివాసం ఉండే వెంకటలక్ష్మి, హరికథలను చూసిన దేవిశ్రీ ప్రసాద్, ఆమెకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Rangasthalam

ఆమె ఆర్ధిక ప‌రిస్ధితులు తెలుసుకుని రూ.ల‌క్ష సాయం చేశారు. సినిమా హిట్ అయి 100 రోజ‌లు ఫంక్ష‌న్ జ‌రుపుకున్న త‌న‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని వెంక‌ట‌ల‌క్ష్మీ చెప్ప‌డంతో స్పందించిన ద‌ర్శ‌కుడు సుకుమార్ ఆమెకు సాయం చేశారు. స్వ‌యంగా ఆమె బ్యాంకు ఖాతాలోకి డ‌బ్బులు పంపించారు. వెంక‌ట ల‌క్ష్మీకి సుకుమార్ డ‌బ్బులు పంపివ్వ‌డంతో ఆమె ద‌ర్శ‌కుడు సుకుమార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపింది.

- Advertisement -