ఎన్టీఆర్ గురించి నేను చూపించేదే నిజంః వ‌ర్మ‌

232
rgv
- Advertisement -

రామ్ గోపాల్ వ‌ర్మ ఈపేరు వింటేనే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చెప్పుకోవ‌చ్చు. ఆయ‌న నోటి నుంచి ఏం మాట్లాడిన అది క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతుంది. ఇటివ‌లే ఆయ‌న నిర్మించిన భైర‌వ‌గీత సినిమా విడుద‌లైన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన వెన్నుపోటు సాంగ్ ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో ఈసాంగ్ పై నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. చంద్ర‌బాబు అభిమానులు వ‌ర్మ‌పై మండిప‌డుతున్నారు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో చూపంచబోయేది అసలు నిజం కాదు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నేను చూపించబోయేది మాత్రమే అసలు నిజం అని చెప్పారు వ‌ర్మ‌.

ntr

ఈసంద‌ర్భంగా వ‌ర్మ మాట్లాడుతూ..`ఏ దేశమేగిన ఎందెందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని. తొలిసారి విన్నప్పుడు కలిగే అనుభూతి వేరు. ప్రతి ఒక్కరూ దణ్ణం పెట్టి బతిమాలుకుని ఓట్లు అడుగుతారు.. ఎన్టీఆర్ ఒక్కరే రేయ్ అని ఓట్లు అడిగారు. మొదటిసారి అలా అడిగింది ఆయనొక్కరే. నిజాయితీ వల్లనే అది సాధ్యం. ఒక మనిషిగా – హీరోగా – నాయకుడిగా ఉన్న ఆయన ఎన్టీఆర్ శ్రీదేవి – జయసుధ – జయప్రద లాంటి అందగత్తెల్ని వదిలేసి – వాళ్లకు ద్రోహం చేసి లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడమేంటి? అన్న సందిగ్ధత కలిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసేప్పుడు పరిశోధించాను. అసలు నిజం ఏంటి? అని వెతికితే.. అయితే లక్ష్మీ పార్వతి గురించి చెప్పగలిగే ఒక ప్రత్యక్ష సాక్షి దొరికాడు. ఆయన పేరు ఏంటంటే యన్.టి.రామారావు. ఆయన నా కల్లోకి రాలేదు. యూట్యూబ్ ఆయన వీడియో ఒకటి చూశాను.. లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడినది. ఆయన కంటే పెద్ద సాక్ష్యం ఎవరూ అవసరం లేదు“

- Advertisement -