ఇంట్లో ఉండలేను అనే వాళ్లు ఇలా ట్రై చేయండి

446
puri
- Advertisement -

కరోనా వైరస్ ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు జనతా కర్ఫ్యూ ను విధించిన సంగతి తెలిసిందే. 14గంటలు ఎవ్వరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకూదని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పిలుపు మేరకు నేడు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూను పాటిస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా దర్శకుడు పూరీ జగన్నాథ్ తనదైన శైలిలో స్పందించాడు. దేశ ప్రజలంతా ఈ ఒక్క రోజు ప్రధాని మాట వినాలని చెప్పారు. ఇవాళ ఒక్క రోజు జనతా కర్ఫ్యూ పాటిస్తే కరోనా వైరస్ చైన్ కట్ అవుతుందని చెప్పారు. కాబట్టి పెద్దల మాటను గౌరవించి ఇంట్లోనే ఉందామన్నాడు. తాము ఇంట్లో ఉండలేమంటూ ప్రస్టేషన్‌కు గురయ్యే వారికి తనదో సలహా అని, అలాంటి వారు నేటి ఉదయం నాలుగు స్పూన్ల ఆముదం తాగాలని సూచించాడు. అలా చేస్తే విరేచనాలు పట్టుకుని బయటకు రాలేరని వివరించాడు.

- Advertisement -