ధోనీ అంటే తెలుసు.. కోహ్లీ కూడా తెలుసు.. రహానే పేరు చెప్పినా గుర్తు పడతారు. కానీ మీకు దేవకి తెలుసా? సరోజ్ పేరు ఎప్పుడైనా విన్నారా? సుజాతను గుర్తుపడతారా? లేదు కదా.. ఎందుకంటే మన క్రికెటర్లంతా ఇప్పటివరకూ తండ్రి ఇంటిపేర్లతోనే మనకు తెలుసు. కానీ తొలిసారి వాళ్లు తమ జెర్సీలపై తల్లుల పేర్లు రాసుకున్నారు.
సమాజంలో పురుషులతోపాటు మహిళలకు కూడా సమాన స్థానం కల్పించాలని ప్రచారం చేస్తున్న స్టార్ ప్లస్ చానెల్ ‘నయీ సోచ్’ పేరుతో టీవీ క్యాంపెయిన్ను ఆరంభించింది. ఇందులో భాగంగా టీమిండియా స్టార్ క్రికెటర్లు ధోనీ, కోహ్లీ, రహానెలతో తల్లులకు వందనం చేయిస్తోంది. వీరు తమ జెర్సీలపై తమ లేదా తండ్రి పేర్లకు బదులు తల్లిపేరు ధరించి కనిపిస్తారు. తండ్రి పేరు ఎంత ముఖ్యమో తల్లి పేరూ అంతే ముఖ్యమనే సందేశాన్నిస్తారు. అంతేకాకుండా జీవితంలో తాము ఉన్నత స్థాయుకి ఎదగడంలో తల్లి ఎలాంటి పాత్ర పోషించిందో గుర్తు చేసుకుంటారు. ధోనీ జెర్సీపై అతడి తల్లి దేవకి పేరు, కోహ్లీ జెర్సీపై సరోజ్, రహానె జెర్సీపై సుజాత పేర్లతో క్యాంపెయిన్లో కనిపిస్తారు.
ఆ వీడియోలు మీరూ చూడండి..