వికారాబాద్ లోని నవాబ్ పేట్ ఎస్సై కృష్ణను కొందరు యువకులు కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఎస్సై కృష్ణ తీవ్రగాయాలతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎస్సై కృష్ణ కాలు విరగడంతో పాటు, పాదం నుజ్జునుజ్జయింది. అనంతగిరిలో వాహనాలు తనిఖీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో నలుగురు ఈ ఘటనకు పాల్పడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు టోలీచౌక్ కు చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆయన అందిస్తోన్న సేవలను అభినందిస్తున్నానని అన్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.
నూతన సంవత్సర వేడుక బందోబస్త్ లో యాక్సిడెంట్ కు గురి అయిన వికారాబాద్ S.I. శ్రీకృష్ణ త్వరగా కోలుకోవాలని వేడుకొంటున్నాను. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ప్రమాదాలకు గురైనా, వ్యక్తిగతంగా నష్టం జరిగినా మొక్కవోని ధైర్యం విశ్వాసంతో మీరు ప్రజలకు అందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను pic.twitter.com/qTTjk58R1V
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) January 2, 2020