తేజ‌స్‌లో ప్రయాణించిన రాజ్ నాథ్ సింగ్

377
rajnathtejas
- Advertisement -

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేడు యుద్ద విమానం తేజస్ లో విహరించారు. బెంగుళూరులోని హిందుస్ధాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎయిర్ పోర్ట్ లో ఆయన యుద్ద విమానంలో ప్రయాణం ప్రారంభించారు. తేజస్ లో ప్రయాణం నేపథ్యంలో ఆయన జీ-సూట్ ధరించారు. ఈ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.

అతి తక్కువ బరువు కలిగిన తేజస్ యుద్ద విమానాన్ని భారత్ తయారు చేసింది. మరోవైపు తేజస్ లో ప్రయాణించిన తొలి రక్షణశాఖమంత్రిగా రాజ్ నాథ్ సింగ్ రికార్డుల్లోకెక్కారు. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజ‌స్‌ను త‌యారు చేసిన విష‌యం తెలిసిందే. తేజ‌స్‌లో రెండు సీట్లు ఉంటాయి. గ‌త శుక్ర‌వారం గోవాలో నిర్వ‌హించిన ల్యాండింగ్ ప‌రీక్ష‌లో తేజ‌స్ విజ‌య‌వంత‌మైంది.

- Advertisement -