‘దర్బార్’.. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు..!

292
rajini
- Advertisement -

రజనీకాంత్ తాజా చిత్రంగా రూపొందిన ‘దర్బార్’ ఈ నెల 9న భారీస్థాయిలో విడుదలైంది. మురగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోను విడుదలైన తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకపోతోంది. అంతేకాకుండా వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నయనతార, నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి అనిరుద్‌ రవిచందర్‌ సంగీతమందించాడు.

darbar

ఇక ఈ చిత్రం రెండో రోజు కూడా తన జోరును కొనసాగించింది. బాలీవుడ్‌లో తానాజీ, ఛపాక్‌ చిత్రాలు విడుదలైనప్పటికీ ‘దర్బార్‌’జోరు, హుషారు ఏమాత్రం తగ్గలేదు. ఆ చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగించింది. రెండో రోజు కూడా దాదాపు రూ. 50 కోట్ల పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

దీంతో ఓవరాల్‌గా సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రజనీ దర్బార్‌ రూ. 100 కోట్ల మార్క్‌ దాటిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ ‘రజనీ దర్బార్‌’బాక్సాఫీస్‌ వద్ద హిస్టరీ క్రియేట్‌ చేయబోతోందని అతడి ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.

- Advertisement -