ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఎవరికిచ్చిన ఓకే అని తెలిపారు మాజీ మంత్రి,టీఆర్ఎస్ నేత దానం నాగేందర్. ఖైరతాబాద్కు చెందిన బీజేపీ నాయకులు దానం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగేందర్..రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. తాను ఏ పదవి ఆశించి టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని, పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు. అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందని..టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలే గెలుపు తీరాలకు చేరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో సంతృప్తి చెందిన ప్రజలు స్వచ్ఛందంగా టిఆర్ఎస్కు మద్ధతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. అధికార దాహంతో ఓట్ల కోసం వస్తున్న మహాకూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.