టెన్త్ , ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎస్‌ సమీక్ష

378
cs
- Advertisement -

మార్చి, ఏప్రిల్ లో జరగనున్న ఇంటర్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటర్‌, ఎస్‌ఎస్‌సీ బోర్డులు, సీజీజీ, టీఎస్టీఎస్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణలో గత సంవత్సరం జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు.

ప్రభుత్వం నియమించిన త్రిసభ్యకమిటీ సూచనలను ఈ రెండు శాఖలు అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో అమలు చేయడం తో పాటు పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించటానికి అదనపు చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. ప్రతి Evaluator కు అవసరమైన పూర్తి స్థాయి శిక్షణను అందించి గత సంవత్సరంలో సాధారణంగా జరిగిన తప్పులపై అవగాహన కల్పించి , ఏ ఒక్క విద్యార్ధి నష్ట పోకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.

విద్యార్ధుల సౌకర్యార్ధం ఆన్ లైన్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు. అడ్మిషన్ నుండి తుది ఫలితాల వెల్లడి వరకు రెగ్యులర్ క్యాలెండర్ ను రూపొందించాలన్నారు. ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుండి మార్చి 23 వరకు , పదవ తరగతి పరీక్షలు మార్చి 19 నుండి ఏప్రిల్ 6 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సారి ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల విద్యార్ధులు , పదవ తరగతి పరీక్షలకు 5.08 లక్షల విద్యార్ధులు హజరవుతున్నారని, సెంటర్ల ఏర్పాటు , జంబ్లింగ్ పద్దతి, హల్ టికెట్ ల జారీ , ఫలితాల వెల్లడి తదితర ప్రక్రియలను అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు.

- Advertisement -