మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం

354
- Advertisement -

మేడారం జాతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. మేడారంలో విధులు నిర్వహిస్తున్న అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డిలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ.. మేడారం జాతర ఏర్పాట్లను సీఎం కేసీఆర్ ప్రతిస్టాత్మకంగా తీసుకున్నారని..భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఏర్పాట్లు బాగున్నట్లు తెలిపారు.

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… మేడారం జాతరలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. 10వేల మంది పోలీసులు బందొబస్తులో పాల్గోంటున్నట్లు తెలిపారు. మేడారం చుట్టుపక్కల మొత్తం 350 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూల్ కి అనుసంధానం చేశామన్నారు. ఈసారి ప్రత్యేకంగా షీ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

- Advertisement -