కరోనా…అప్ డేట్స్

357
corona
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 81వేలకు చేరగా ఇప్పటివరకు 3 లక్షల మంది కోలుకున్నారు. ఇక అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.95 లక్షలు దాటగా అమెరికాలో ఇప్పటివరకు 12,813 మంది కరోనాతో మృతి చెందారు.

ఇక ఇవాళ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం11గంటలకు రాజకీయ పక్షాల నేతలతో మాట్లాడనున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,311కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా, 468 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 404కు చేరింది. ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 11 మంది మృతి చెందారు. ఇక ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 314కి చేరుకుంది. ఇప్పటివరకు నలుగురు కరోనాతో మృతి చెందగా, ఆరుగురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

- Advertisement -