క‌రోనా నివార‌ణ‌కు రోహిత్ శ‌ర్మ భారీ విరాళం

214
rohith
- Advertisement -

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 7ల‌క్ష‌ల‌కు పైగా మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. కాగా ఇప్ప‌టివ‌ర‌కు 30వేల మంది మ‌ర‌ణించారు. మ‌న దేశంలో ఇప్ప‌టికే లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా నివార‌ణ‌కు దేశ వ్యాప్తంగా ప‌లువురు సెల‌బ్రెటీలు విరాళం ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా టీంఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న వంతు స‌హాయం చేశారు. క‌రోనాను ఎదుర్కొనేందుకు త‌న వంతు స‌హాయం చేస్తున్న‌ట్లు తెలిపారు.

మన దేశం తిరిగి నిలబడాల్సిన అవసరం మనకు ఉంది.. మనపై బాధ్యత ఉంది. నేను నా వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నాను. పీఎం కేర్ ఫండ్స్‌కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షల రూపాయలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు, వీధి శునకాల సంక్షేమ నిధికి రూ.5 లక్షలు ఇస్తాను. కరోనాపై చేస్తోన్న పోరాటంలో ప్రధాని మోదీకి, మన నేతలకు మద్దతు తెలుపుదాం’ అని ట్వీట్ చేశారు. కాగా ఇప్ప‌టికే ప‌లువురు క్రికెట‌ర్లు ధావ‌న్, కోహ్లి, ర‌హానే, ప‌టాన్ బ్ర‌ద‌ర్స్ త‌మ వంతు స‌హాయం చేశారు.

- Advertisement -