రాష్ట్రంలో 45కు చేరిన కరోనా కేసులు..

461
corona in Telangana
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం రోగుల సంఖ్య 45కు చేరుకుంది. గురువారం మరో నలుగురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే వీరు ఇటీవల కాలంలో విదేశీ ప్రయాణం చేయలేదని తేలింది. ఢిల్లీ, తిరుపతి వెళ్లొచ్చిన తర్వాత వీరిలో ఈ లక్షణాలు కనిపించినట్టు వైద్యాధికారులు తెలిపారు.

తాజాగా సోకిన నలుగురినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో నమోదైన 45 కేసుల్లోనూ విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారు మాత్రమే ఉన్నారు. ఈ నలుగురితో ఇప్పటి వరకు సన్నిహితంగా ఉన్న వారిని కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

తాజాగా, నమోదైన నలుగురిలో ఒకరు మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్‌ వ్యక్తి. ఈ నెల 14న రైలులో ఢిల్లీ వెళ్లి 18న సికింద్రాబాద్ చేరుకున్నాడు. మరో రెండు కేసుల్లో వైద్యుడు, ఆయన భార్య ఉన్నారు. 14 నుంచి 16 వరకు సెలవులో ఉన్న వీరిద్దరూ 17న విమానంలో తిరుపతి వెళ్లి మళ్లీ అదే రోజు తిరిగొచ్చారు.

18, 19 తేదీల్లో ఇంటి వద్దే ఉన్నారు. 24న వీరు పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. చివరి వ్యక్తి సికింద్రాబాద్ బుద్ధనగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆయన కూడా ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాతే కరోనా సోకినట్టు తేలింది.

- Advertisement -