కరోనా ఎఫెక్ట్.. చిరంజీవి ఆచార్య షూటింగ్ వాయిదా

293
Chiranjeevi
- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇండియాలో కూడా ఈవ్యాధి బారిన పడ్డవారి సంఖ్య పెరుగుతుండటంతో స్కూళ్లు, థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్ర‌భుత్వం మార్చి 31 వ‌ర‌కు స్కూల్స్‌, సినిమా హాల్స్‌, క‌ళాశాల‌లు, జిమ్ వంటి వాటికి సెల‌వులు ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఇదే క్ర‌మంలో కొంద‌రు నిర్మాత‌లు కూడా త‌మ సినిమా షూటింగ్‌ల‌కి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం కూడా అవసరం అని చిరంజీవి పిలుపునిచ్చారు.

- Advertisement -