కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే..!

282
congress
- Advertisement -

మే 19న (చివరి దశ) జరగబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం 40 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఖరారు చేసింది. పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ప్రచారాన్ని నిర్వహించే 40 మంది స్టార్ క్యాంపెయినర్లు వీరే.

ఇందులో కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీలు ఉన్నారు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కీలక నేతలైన అహ్మద్ పటేల్, అంబికా సోని, కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, షీలా దీక్షిత్, మనీశ్ తివారీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, రాజ్ బబ్బర్, జైవీర్ షెర్గిల్ తదితరులు ఉన్నారు.

- Advertisement -