బీజేపీలోకి వెళ్తే నేనే సీఎంః కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

323
komatireddy-rajagopal-reddy
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానం తీవ్ర ఆరోపనణలు చేసిన సంగతి తెలిసిందే. అందుకుగాను ఆయనకు షోకాజ్ నోటిసులు జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటి. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక లాంఛనమే అని తెలుస్తుంది. ఇటివలే ఢిల్లీకి వెళ్లిన ఆయన పలువురు పెద్దలతో సమావేశమయినట్లు తెలుస్తుంది.

తాజగా మరో సారి రాజగోపాల్ రెడ్డి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన అభిమానితో ఫోన్ లో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. నేను బీజేపీలోకి వెళ్తే మీరంతా తన వెంటే రావాలని ఆ కార్యకర్తకు చెప్పారు. దీంతో ఆ అభిమాని మునుగోడులో మీ గెలుపు కోసం చాలా కష్ట పడ్డాం..ఇప్పడు మీరు పార్టీ మారుతా అంటే ఎలా అని ప్రశ్నించాడు.

దీంతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..బీజేపీలోకి వెళ్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాడు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని..ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడని తెలిపాడు. దేశ వ్యాప్తంగా మోదీ హవా నడుస్తుందని యువత మొత్తం మోదీ వైపే చూస్తున్నారని అందుకే తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. మరీ ఈ ఆడియోపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

- Advertisement -