గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్

336
Collector
- Advertisement -

ఎంపీ సంతోష్‌ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధ్బతమైన స్పందన వస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖలే కాకుండా కలెక్టర్లు కూడా ఈగ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గోన్ని ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు విసిరిన సవాల్ ను స్వీకరించినట్లు తెలిపారు.

కార్తీక మాసం కావడంతో జామా, కదంబ, పనస,మారేడు, ఉసిరి, సపోటా మొక్కలను నాటి మరో ముగ్గురికి సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి, సినిమా హాస్యనటులు శివారెడ్డిలకు గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు. సామాజిక భాద్యతగా మొక్కల పెంపకానికి గ్రీన్ చాలెంజ్ లో అందరూ భాగస్వాములయ్యేలా తనవంతు కృషి చేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటినందుకు ట్వీట్టర్ ద్వారా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ సంతోష్ కుమార్.

- Advertisement -