మరికాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం

401
cmkcr
- Advertisement -

హుజుర్ నగర్ ఉప ఎన్నికల తుది ఫలితం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. చివరి ఫలితం తర్వాత తెలంగాణ భవన్ లో హుజుర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. మొత్తం 22 రౌండ్లకు గానూ ఇప్పటి వరకు 13 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి.

తొలి రౌండ్‌ నుంచి 13వ రౌండ్‌ వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డినే ఆధిక్యంలో ఉన్నారు. సైదిరెడ్డి విజయం ఖాయం కావడంతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ వస్తుండటంతో భారీ టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.

- Advertisement -