మనవడిని పరామర్శించిన సీఎం కేసీఆర్..

294
kcr
- Advertisement -

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆర్య తీవ్ర జ్వరంతో హైదరాబాద్ రెయిన్ బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 15 నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనవడిని శుక్రవారం పరామర్శించారు కేసీఆర్.

మనుమడిని పలకరించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పది నిమిషాల పాటు మనవడి వద్ద ఉండి వెళ్లిపోయారు. జ్వరంతో బుధవారం ఆస్పత్రిలో చేరిన ఆర్య ఆరోగ్యం కుదుట పడిందని, శనివారం డిశ్చార్జి చేసే అవకాశాలున్నాయని ఆస్పతి వర్గాలు తెలిపాయి.

- Advertisement -