నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన

377
- Advertisement -

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చే నిధులను పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రితో సమావేశం కావడం కోసం గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రితో సీఎం భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు.

kcr

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పెంచడంతోపాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. అలాగే ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకానికి ఆర్థికసాయం అందించాలని సీఎం కోరనున్నారు.ఈ రెండు పథకాలకు ఆర్థిక సహాయమివ్వాలని ప్రధానిని ఈ భేటీలో కోరనున్నారు.

- Advertisement -