మీ జిల్లా గురించి తెలుసుకోండి..ప్రణాళిక రూపొందించండి

205
- Advertisement -

జిల్లాల పునర్వ్యవస్థీకరణతో అతిపెద్ద పరిపాలనా సంస్కరణ తెచ్చిన నేపధ్యంలో వాటి ఫలితాలు ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలతో చిన్న పరిపాలనా విభాగాలు ఏర్పడ్డాయని, కలెక్టర్లు, ఇతర అధికారులకు పర్యవేకణ సులువైందని సిఎం అన్నారు.రాష్ట్రంలో పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపధ్యంలో ప్రజలకు వివిధ రంగాల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు, అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అమలయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాల వారీగా నో యువర్ డిస్టిక్స్ – ప్లాన్ యువర్ డిస్టిక్ట్ (మీ జిల్లా గురించి తెలుసుకోండి, మీ జిల్లాకు ప్రణాళిక రూపొందించండి) అనే నినాదంతో జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు కావాలని కోరారు. స్థానిక వనరులు, అవసరాలు గుర్తించి ఏ జిల్లాలో ఏం చేయాలనే విషయంపై అవగాహనకు రావాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా రాబోయే 8-10 ఏండ్ల కోసం ప్రణాళిక సిద్ధం చేసి, ఇప్పటి నుంచి పని ప్రారంభించాలి. ఎటు పడితే అటు అడ్డదిడ్డంగా కాకుండా ఓ పద్దతి ప్రకారం పాలన సాగేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

గతంలో జిల్లాల విస్తీర్ణం, జనాభా చాలా ఎక్కువగా ఉండేదని, దీనివల్ల కలెక్టర్లు పాలనా వ్యవహారాలను క్షేత్రస్థాయిలో పర్యవేకించడం కష్టంగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు జిల్లాల విస్తీర్ణం, జనాభా తక్కువగా ఉందని, ప్రతీ కలెక్టర్ పరిధిలో రెండు నుంచి నాలుగు లక్షల కుటుంబాలే ఉన్నాయని సిఎం చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంకేమ కార్యక్రమాలు ప్రతీ ఒక్కరికి అందేలా చూడవచ్చని సిఎం అన్నారు. అక్రమాలను, అవినీతిని, జాప్యాన్ని నివారించి పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించడం సాధ్యమవుతుందని సిఎం చెప్పారు.

kcr

“కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా వెళ్లిన వారంతా యువకులని… సేవ చేయాలనే తపన ఉంది. వారు శ్రద్ధ పెట్టి పనిచేయడానికి అవకాశం కల్పించాలన్నారు. చొరవ చూపే వెసులుబాటు కల్పించాలి. వారంతా ఒకే పద్దతి ప్రకారం, ఒకే స్పూర్తితో పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో అద్భుత ఫలితాలు కనిపిస్తాయన్నారు. ప్రజలు కూడా మార్పును గమనిస్తారు. ప్రయోజనం పొందుతారు. సీనియర్ అధికారులు, గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వారు యువతరానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలి. మార్పు తీసుకొచ్చే పనిలో కలెక్టర్లే సమన్వయ కర్తలుగా ఉండాలి. జిల్లా పరిధిలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా వాటిని కలెక్టరే పరిశీలించాలి, పర్యవేక్షించాలి. కొత్త పరిపాలనా విభాగాలు రావడం వల్ల పనిభారం తగ్గింది. కాబట్టి పనితీరులో మరింత ప్రభావం, సమర్థత కనిపించాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు తెచ్చుకున్నాం. ప్రజలు మార్పు ప్రభావాన్ని చవిచూడాలి. మంచి పాలన అందాలి. అవినీతి పోవాలి. రుగ్మతలు పోవాలి. రెవెన్యూ కార్యాలయాల్లో కావాల్సిన సేవలు సకాలంలో, అవినీతి రహితంగా పొందాలి. డబ్బులివ్వకపోతే పనికాదు అనే భావన పోవాలి. మ్యుటేషన్లు, పహాణి నకళ్లు, సర్టిపికెట్లు సకాలంలో అందాలి. రెవెన్యూ మున్సిపాలిటీ, సర్వే విభాగాల్లో లంచం ఇవ్వకుండా పని జరిగినప్పుడు ప్రజలకు అవినీతి రహిత పాలన అందినట్లు లెక్క కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు అవసరమైన వెంటనే రైతుల దరికి చేరాలి. కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి పోవాలె. గ్రామాల్లో గుడుంబా మహమ్మారి పారిపోవాలి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలి. అందరూ చదవాలి. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. ఎక్కువ మంది ఆదారపడే వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవాలి. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.

kcr

అధికారులు కూడా అదే స్పూర్తితో పనిచేసి ఏ సమయంలో రైతులకు ఎలాంటి సహకారం కావాలో అది అందించాలి. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేందుకు ముందుగానే ప్లాన్ సిద్ధం చేయాలి. మార్కెట్లలో గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. వ్యవసాయ శాఖలో కొత్తగా నియామకమయ్యే ఉద్యోగుల సేవలను క్షేత్రస్థాయిలో బాగా ఉపయోగించుకోవాలి. నేను దత్తత తీసుకున్న ఎర్రవెల్లి, నర్సన్నపేటల్లో అందరికోసం అందరం అనే దృక్పధంతో సామూహిక వ్యవసాయం చేస్తున్నాం. గ్రామాలను స్వయం సమృద్ధి సాధించే దిశగా తీర్చిదిద్దుతున్నాం. ఆ గ్రామాలను తెలంగాణకు ఆదర్భంగా నిలుపుతాం. వాటి స్పూర్తితో మిగతా గ్రామాలు కూడ అలాగే బాగుపడాలన్నది నా ఉద్దేశ్యం. గ్రామాల్లో గ్రీన్ కవర్ పెంచడానికి కృషి చేయాలి. ఎక్కడికక్కడ నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి.

హరితహారం నిరంతరం సాగాలి. మిగతా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షించాలి” అని సిఎం కోరారు. “ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన వనరులుంటాయి. ఒక్కో ప్రాంతంలోని ప్రజలకు ఒక్కో రకమైన అవసరాలుంటాయి. వాటికి తగినట్లు మన ప్రణాళిక ఉండాలి. ముందుగా అధికారులు ఆ జిల్లా సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి. అవసరాలు గుర్తెరగాలి. వనరులను గుర్తించి, ఉపయోగంలోకి తేవాలి. వీటి ఆధారంగా ప్రతీ జిల్లాలో ప్రత్యేక ప్రణాళిక తయారు కావాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది” అని సిఎం చెప్పారు.

‘భారతదేశం కుటుంబాల్లో నివసిస్తున్నది. భారతదేశ పౌరుల జీవన విధానం వ్యక్తిగతంగా ఉండదు. కుటుంబాలతో కలగలిసి ఉంటుంది. కుటుంబాలు బాగుంటేనే దేశం బాగున్నట్లు లెక్క అందుకే కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేందుకు, కుటుంబం క్షేమంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. కుటుంబం ప్రాతిపదికగా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలి” అని సూచించారు. “అధికార యంత్రాంగంలో చురుకుదనం రావాలి. పక్కా ప్రణాళికతో ముందుకుపోవాలి. అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని విదంగా పాలనా పద్ధతులుండాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో కనిపెట్టి దాన్ని నివారించగలగాలి. టిఎస్ ఐపాస్ మాదిరిగా ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలనే విషయంలో స్పష్టత ఉండాలి. విధాన రూపకల్పన ఎంత బాగున్నా, దాన్ని అమలు చేసే క్రమంలో సరైన దృక్పథం లేకుంటే పధకాలు సత్ఫలితాలు ఇవ్వవు. తెలంగాణలో మంచి పాలన అందించడానికి అవసరమైన పద్దతులు రూపొందించి, అమలు చేయగలిగితేనే ప్రజలకు పరిపాలనా సంస్కరణల ఫలితాలు అందుతాయి” అని సిఎం అన్నారు. ‘రాష్ట్రంలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం అమలవుతున్నది? దాని లక్ష్యాలు ఉద్దేశాలేమిటి? జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా ఆశిస్తున్నదేమిటి? అభివృద్ధి సంకేమ కార్యక్రమాల అమలుకోసం కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలేమిటి? తదితర అంశాలపై చర్చించేందుకు త్వరలోనే కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తాం” అని కేసీఆర్ ప్రకటించారు.

భారతదేశం కుటుంబాల్లో నివసిస్తున్నది. భారతదేశ పౌరుల జీవన విధానం వ్యక్తిగతంగా ఉండదు. కుటుంబాలతో కలగలిసి ఉంటుంది. కుటుంబాలు బాగుంటేనే దేశం బాగున్నట్లు లెక్క అందుకే కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేందుకు, కుటుంబం క్షేమంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. కుటుంబం ప్రాతిపదికగా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలి” అని సూచించారు. “అధికార యంత్రాంగంలో చురుకుదనం రావాలి. పక్కా ప్రణాళికతో ముందుకుపోవాలి. అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని విదంగా పాలనా పద్ధతులుండాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో కనిపెట్టి దాన్ని నివారించగలగాలి. టిఎస్ ఐపాస్ మాదిరిగా ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలనే విషయంలో స్పష్టత ఉండాలి. విధాన రూపకల్పన ఎంత బాగున్నా, దాన్ని అమలు చేసే క్రమంలో సరైన దృక్పథం లేకుంటే పధకాలు సత్ఫలితాలు ఇవ్వవు. కాబట్టి ప్రాసెసింగ్ అప్రోచ్ చాలా ಮಿುಖ್ಯಾಂ. తెలంగాణలో మంచి పాలన అందించడానికి అవసరమైన పద్దతులు రూపొందించి, అమలు చేయగలిగితేనే ప్రజలకు పరిపాలనా సంస్కరణల ఫలితాలు అందుతాయి” అని సిఎం అన్నారు. ‘రాష్ట్రంలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం అమలవుతున్నది? దాని లక్ష్యాలు ఉద్దేశాలేమిటి? జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా ఆశిస్తున్నదేమిటి? అభివృద్ధి సంకేమ కార్యక్రమాల అమలుకోసం కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలేమిటి? తదితర అంశాలపై చర్చించేందుకు త్వరలోనే కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తాం” అని కేసీఆర్ ప్రకటించారు.

- Advertisement -