కాళేశ్వరం పనుల పురోగతిపై కేసీఆర్ రివ్యూ…

266
kcr review
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

బ్యారేజీల వద్ద రెండు చొప్పున హెలిప్యాడ్లు నిర్మించాలని సూచించిన సీఎం… బ్యారేజీల వద్ద నదీ ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ ఎంత భారీ వర్షం కురిసినప్పటికీ ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హై ప్లడ్ లెవల్‌కు చాలా ఎత్తులో వాచ్‌టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండాలన్నారు. ప్రస్తుతమున్న హెచ్‌ఎఫ్‌ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్‌ఎఫ్‌ఎల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.

ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యారేజీలు, పంపుహౌజులు, సబ్‌స్టేషన్ల వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పోలీసు క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీ కవిత, సీఎస్ ఎస్‌కే జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -