అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త చట్టం-సీఎం కేసీఆర్‌

314
CM KCR
- Advertisement -

నూతన పురపాలక చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అవినీతి నిర్మూలన, మంచి సేవలందించడమే కొత్త చట్టం లక్ష్యంగా సీఎం పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పన చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

అయితే ప్రస్తుతం మున్సిపల్ చట్టంలో GHMCకి ఒక చట్టం, మున్సిపల్ కార్పొరేషన్ కు ఒక చట్టం, మున్సిపాలిటీ లకు మరో చట్టం ఇలా మూడు చట్టాలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి ఒక కొత్త చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగానే కొత్త చట్టంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష చేస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -