ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ..

573
kcr modi
- Advertisement -

మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. ప్రధానితో భేటీ సందర్భంగా రెండు జీవనదులు గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేదా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు.

కంటోన్మెంట్ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు రక్షణశాఖకు చెందిన భూములను ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం అందించే అంశంతో పాటు పన్నుల వాటా పెంచాలని ప్రధానిని కోరనున్నారు. విభజన హామీలను అమలుచేయాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరనున్నారు.

అంతకముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుమారు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు,కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయాలపై ఈ భేటీలో చర్చించారు.

- Advertisement -