మానవత్వం చాటుకున్న సీఎం కేసీఆర్‌..

512
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్‌ తన మంచి మనస్సును మరో సారి చాటుకున్నారు. వికలాంగుడైన ఓ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. ఆ వృద్దుడి కుటుంబానికి అండాగా నిలిచారు. గురువారం మద్యాహ్నం సీఎం కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యంలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు ఆపి కిందకు దిగారు. వృద్ధుని దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తన పేరు మహ్మద్ సలీమ్ అని, గతంలో డ్రైవర్‌గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నాని ఆ వృద్ధుడు తెలిపాడు.

cm kcr

అయితే నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడడంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం కూడా బాగా లేదని, ఉండడడానికి ఇల్లు కూడా లేదని, తగిన సహాయం చేయాలని కోరాడు. దీనికి స్పందించిన సీఎం.. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆ వృద్దుడికి వికలాంగుల పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

kcr cm

సీఎం ఆదేశాల మేరకు టోలి చౌకిలో సలీమ్ నివాసముంటున్న ఇంటికి వెళ్లి కలెక్టర్ విచారణ జరిపారు. సలీమ్ వికలాంగుడని దృవీకరిస్తూ సదరం సర్టిఫికెట్ ఉండడంతో అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్ కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండడంతో సిఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చేసిన సాయానికి ఆ వృద్దుడి కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతోంది.

saleem family

- Advertisement -