బీజేపీ , కాంగ్రెస్ లు దేశానికి పట్టిన దరిద్రంః సీఎం కేసీఆర్

248
kcr Karimnagar
- Advertisement -

దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్, బీజీపీ అన్నారు సీఎం కేసీఆర్. ఈ రెండు పార్టీలు భారత దేశ పరువు తీస్తున్నాయన్నారు. నేడు కరీంనగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సభలో సీఎం పాల్గోన్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..బీజేపీ నేతలతో తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు సీఎం. దేశంలో బీజీపీ వాళ్లు మాత్రమే హిందువులయినట్టు మాట్లాడుతున్నారని..అసలైన హిందులవం తామేనని అన్నారు. బీజేపీ నేతలు మాత్రమే పూజలు చేస్తారా? మేము చేయమా పూజలు? మేము దేవుళ్లను దర్శంచుకోమా అని ప్రశ్నించారు. దేశంలో నేను చేసినన్న యాగాలు ఎవడు చేయలేదన్నారు.

దేశానికి ఇంత దారునమైన పరిస్ధితి తీసుకువచ్చింది ఈరెండు పార్టీలు కాదా అని గుర్తు చేశారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు ఉన్నా, సాగుకు నీరు ఇవ్వలేరని, 2004లో ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నేటీకీ పంచాయతీ తేల్చలేదని, రెండు నెలల్లో తేల్చాల్సిన నీటి పంచాయతీలను పదిహేనేళ్లు గడిచినా పరిష్కారం కాలేదని మండిపడ్డారు. దేశంలో 30 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు మూతపడి ఉన్నాయన్నారు. రెండు జాతీయ పార్టీల నాయకులు భారత్ దేశం పరువు పోయేలా ఒకరినోకరు తిట్టుకుంటున్నారని చెప్పారు. దేశంలో ఉన్న సమస్యలు పోవాలంటే సమాఖ్య ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు సీఎం కేసీఆర్.

- Advertisement -