ఆర్టీసీ సమ్మెపై సీఎం సమీక్షా సమావేశం

456
cm kcr
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై ఉన్నతస్ధాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం సమీక్ష చేపట్టనున్నారు. కాగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రైవేటు సిబ్బందితో కొంత వరకు బస్సులను నడుపుతున్నారు ఆర్టీసీ అధికారులు. ఇవాళ సాయంత్రం ఆరుగంటల లోపు ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లోకి రాకపోతే మాజీ ఉద్యోగులుగా గుర్తిస్తామని హెచ్చరించారు.

- Advertisement -