సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు..!

451
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది.ఇవాళ ఢిల్లీలో  ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరగనున్న నీతిఆయోగ్‌ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. అయితే    కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లరాదని నిర్ణయించుకున్నారని తెలిసింది.

ఒకవేళ ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసేందుకు కేసీఆర్‌ సమయం కోరారు. అనుమతి వస్తే ఆయన ఢిల్లీకి వెళ్లే వీలుంది. సమయం లభించని పక్షంలో 21 వరకు ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉండదని సమాచారం.

ఇక మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.ప్రతి పల్లెల్లో  కాళేశ్వరం ప్రాజెక్టు సంబరాలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 19న జరిగే టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఈ మేరకు దిశానిర్దేశం చేయనున్నారు.

- Advertisement -