డాక్టర్ వేణుగోపాల్ మృతి పట్ల సీఎం దిగ్భ్రాంతి..

277
kcr
- Advertisement -

ప్రముఖ ప్రజాభిప్రాయ విశ్లేషకుడు (సెఫాలజిస్ట్), సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలకు ఎంతో విశ్వసనీయత ఉందని, ఆయన చెప్పిన అనేక సర్వే ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.

- Advertisement -