జలవిహార్‌లో ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు..

324
mp santhosh photos 3
- Advertisement -

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 66వ జన్మదిన వేడుకలను సోమవారం నెక్లెస్ రోడ్ లోని జలవిహార్‌లో పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కళాకారుల కోలాటం, బతుకమ్మలు, ఒగ్గుడోలు, పులివేశాదారణలు, గుస్సాడి, కొమ్ము కోయ, యక్షగానం తదితర వేశ ధారణలు, నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. వేదికపై కళాకారులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతో అలరించాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత నేపద్యాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

kcr birthday

అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసేలా ఎల్‌ఇడీ స్క్రీన్ల ను ఏర్పాటు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా జలవిహార్ ఆవరణలో ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటగా, శాసనసభ చైర్మన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉచిత వైద్య శిభిరాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కేసీఆర్‌ జీవిత నేపద్యాన్ని వివరించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ప్రారంభించారు.

mp santhosh photos 4

వికలాంగులకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ వీల్ చైర్ లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి 66వ జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన 66 కిలోల భారీ కేక్ ను రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు కట్ చేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన ప్రముఖులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి బోజన సౌకర్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ లు నవీన్ రావు, బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, కొలన్ లక్ష్మి, ఉప్పల తరుణి, హేమలత, మమతా గుప్తా, హేమలత యాదవ్, బంగారి ప్రకాష్, పులి జగన్, నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

mp santhosh photos 2

బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 66 వ జన్మదినం సందర్బంగా సోమవారం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని డివైడర్‌లో మొక్కలను నాటారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సంతోష్ కుమార్ కు వేదమంత్రాలతో పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, అమీర్ పేట కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -