కేసీఆర్‌కు లక్ష్మణుడిలా.. రామన్నకు హన్మంతుడిలా..

503
dasyam
- Advertisement -

ఈ నెల 9 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం ఖరారు చేశారు.ప్రభుత్వ చీఫ్ విప్ గా దాస్యం వినయభాస్కర్, విప్ లుగా గొంగిడి సునిత, గంప గోవర్థన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధి, రేగ కాంతారావు, బాల్క సుమన్ లను ముఖ్యమంత్రి నియమించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియామకం చేసిన సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు. ఉద్యమకారుడిగా.. పార్టీ విధేయుడిగా గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్, కేటీఆర్ కు కృతజ్ఞడినని వినయభాస్కర్‌ అన్నారు.

 

కేసీఆర్‌కు లక్ష్మణుడిల, రామన్నాకు హన్మంతుడిలా ఇక ముందు పార్టీకి సేవాలందిస్తాను. కార్యకర్తలను కంటికి రెప్పలా కపడుకుంటా. సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతను క్రమశిక్షణతో నెరవేరుస్తాను. నాకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి రుణపడి ఉంటాను.మా కుటుంబం తెలంగాణ కోసం పోరాటం చేసిన కుటుంబ. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారని వినయ భాస్కర్‌ అన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీలో ప్రస్థానం నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నా ను. కార్పొరేటర్ స్థాయి నుండి ఇక్కడ వరకు వచ్చాను.కేటీఆర్‌తో ఉద్యమంలో పని చేసిన వారికి నేను.. నాకు వారు సహకారం అందించుకున్నం.నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమలు చేస్తున్నాను. పార్టీకి వినయ విధేయునిగా ఉంటాను.దసరా రోజున టీఆరెస్ పార్టీ కార్యాలయం కేటీఆర్‌తో ప్రారంభించడానికి సిద్దం చేస్తున్నాను అని వినయభాస్కర్‌ తెలిపారు.

- Advertisement -