జైపాల్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్, కేటీఆర్

525
JaipalReddy Kcr
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈసందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి దేశానికి చేసిన సేవలు మరువలేని వన్నారు సీఎం కేసీఆర్. ఆయన ఆత్మకు శాంతికలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

కొద్ది రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన తీవ్ర జ్వరంతో ఇటీవల ఆస్పత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి జైపాల్‌రెడ్డి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తరలించారు.

- Advertisement -