బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ కవచం. ఇటివలే ఈసినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు. హీరో శ్రీనివాస్ మొదటిసారి పోలీస్ పాత్రలో నటించాడు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తొంది. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకంది.ఇదే అంశంపై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హీరోయిన్ కాజల్ సినిమటోగ్రాఫర్ చోటా కే నాయుడు గురించి చెబుతుండగా ఆయన కాజల్ ను స్టేజి మీదే ముద్దుపెట్టుకున్నారు. దింతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. చోటా కే నాయుడు ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని పలవురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో హీరోయిన్స్ తో ఆయన అసభ్యకరంగా మాట్లాడిన పాత వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు.
ఈనేపథ్యంలో ఈ అంశంపై చోటా కె నాయుడు స్పందించారు. సౌందర్య తర్వాత తాను అంతగా అభిమానించిన హీరోయిన్ కాజల్ అని అందుకే ముద్దు పెట్టుకున్నానని చెప్పాడు. కాజల్ తో కలిసి చాలా సినిమాల్లో పనిచేశానని..ఆమెతో ఉన్న ఫ్రెండ్ వల్లే ముద్దు పెట్టానని..వేరే కారణాలు ఏం లేవని చెప్పుకొచ్చారు.