హోం వర్క్‌చేయలేదని..దారుణం

277
chittor
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ చేయలేదనే కారణంతో ఏకంగా ఆరుగురు విద్యార్థులను నగ్నంగా ఎండలో నిలబెట్టారు స్కూల్‌ టీచర్‌. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.

పుంగనూరు నానాసాహెబ్‌పేటలోని చైతన్య భారతి పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. హోంవర్క్ చేయలేదని పది సంవత్సరాల వయసున్న ఆరుగురు విద్యార్థులను నగ్నంగా తరగతుల బయట నిల్చొబెట్టింది స్కూల్ యాజమాన్యం.

పాఠశాల యాజమాన్యంపై తల్లిదండ్రులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుకు స్పందించిన అధికారులు పాఠశాల గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది. స్కూల్ కరస్పాండెంట్ నాగరాజు నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల నుంచి వివరాలు సేకరించామని దీనిపై జిల్లా విద్యాశాఖాధికారికి నివేదికను అందజేస్తామని ఎంఈవో తెలిపారు.

- Advertisement -