ఓటెత్తిన…తారాలోకం

492
megastar vote
- Advertisement -

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటేసేందుకు సినీ,రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సినీ ప్రముఖులు చిరంజీవి,రామ్ చరణ్,అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్,పోసాని కృష్ణమురళి,పరుచూరి గోపాలకృష్ణ,హీరో సుధీర్ బాబు,కిరవాణి,అమల,రాజమౌళి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జూబ్లీహిల్స్ క్లబ్‌లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు రామ్ చరణ్‌తో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు చిరు. ఓటు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అని ..సరైన అభ్యర్థిని ఎంచుకోవాలని రామ్ చరణ్ చెప్పారు.

ఎఫ్‌ఎన్‌సీసీలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.33లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌లోని పోలింగ్‌ స్టేషన్‌లో ఆయన ఓటు వేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా భార్య ప్రణతిని, తల్లి షాలినిని తీసుకుని వచ్చి క్యూలో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఓటు వేయడం తమ బాధ్యత అన్నారు.

balakrishna balakrishna mohan babu

naga chaitanya

- Advertisement -