సింధుకు గిప్ట్ గా బీఎండబ్ల్యూ కారు

352
Nag-sindhu
- Advertisement -

ప్రపంచ బ్యాడ్మింటిన్  విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధు రికార్డుల్లోకి ఎక్కింది. ఈనేపథ్యంలో సింధుకు పలువురు ప్రముఖులు నజరానాలు ప్రకటిస్తున్నారు. మాజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ ఆమెకు ఖరీదైన బీఎండబ్ల్యూ  కారును బహూకరించనున్నారు.

ఇవాళ మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సినీ నటుడు నాగార్జున హాజరుకానున్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగే ఈవేడుకలో నాగార్జున చేతుల మీదుగా సింధుకు కారు బహుమతిగా ఇవ్వనున్నారు. ఇటివలే సింధు కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఈసందర్భంగా విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడెమీ కోసం సింధుకు ఏపీ సీఎం జగన్ 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు.

- Advertisement -