ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం రద్దు ..

185
Central shocks ‘dual citizenship’ of MLA Ramesh
- Advertisement -

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. చెన్నమనేని రమేష్ భారతీయుడు కాదని జర్మనీ పౌరసత్వం కలిగిఉన్నట్లు హోంశాఖ తెలిపింది.  చెన్నమనని రమేష్‌ 2014లో వేములవాడ నుంచి టీఆర్‌ఎస్‌ తరపున గెలిచారు.

రమేశ్ పౌరసత్వం కేసు ఇటీవల సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆరు నెలల్లో నిర్ణయం ప్రకటించాలని కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశంతో మరోమారు విచారణ జరిపిన కేంద్ర హోం శాఖ, తుది నిర్ణయాన్ని వెల్లడించింది. రెండు రోజుల్లో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని న్యాయం జరుగుతుందని ఆశీస్తున్నానని చెన్నమనేని తెలిపారు.

చెన్నమనేని రమేశ్ కు జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నందున ఆయన ఎన్నిక చెల్లదంటూ నాడు బీజేపీలో ఉన్న ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో తీర్పు ప్రకటించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ, చెన్నమనేని రమేశ్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. దీంతో, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున వేములవాడ నుంచి పోటీ చేసి ఆయన గెలిచారు.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,దివంగత  మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు కుమారుడు చెన్నమనేని రమేష్. ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రమేష్…టీఆర్ఎస్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌ రావు స్వయాన బాబాయ్ అవుతారు.

- Advertisement -