మొక్కలు నాటిన పారిశ్రామికవేత్త సురేందర్ రావు

325
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభంచిన గ్రీన్ ఛాలెంజ్ కు దేశ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గోంటున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రావు. అమలాపురం లోని తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అన్నారు. ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈసందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్నతలు తెలిపారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ సవాల్ స్వీకరించాలని తన మిత్రులు చిత్తూరి నరేందర్, అక్కినేని శ్రీధర్, కర్తురి రంగ , బేతిన హనుమంతరావు లను కొరారు

- Advertisement -